
PMGKAY | 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్ ఆమోదం
PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇతర పథకాలను కేంద్రం మరోసారి పొడిగించింది. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకాల కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత...