Monday, April 7Welcome to Vandebhaarath

Tag: parliament

Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
National

Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ (BAC) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని, సభలో అప్పటి పరిస్థితిని బట్టి దీనిని పొడిగించవచ్చని అన్నారు.ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, అనేక ఇతర ఇండియా బ్లాక్ సభ్యులు వాకౌట్ చేయడంతో, బిల్లుపై ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ ఉద్రిక్తతలు, చర...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం
National

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు.నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి
Trending News

Priyanka Gandhi | పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ.. స్పందించిన‌ బిజెపి

Priyanka Gandhi | కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ 'పాలస్తీనా (Palestine) అని రాసి ఉన్న బ్యాగుతో పార్ల‌మెంట్‌ (Parliament)కు రావ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప్రియాంక బ్యాగ్ తో ఉన్న ఫొటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ సోమవారం (డిసెంబర్ 16) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పోస్ట్ చేశారు. ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది 'ముస్లింల బుజ్జగింపు చ‌ర్య అని పేర్కొంది. ఈ వివాదంపై సోష‌ల్‌మీడియాలో అనేక మంది నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.ప్రియాంక గాంధీ తన మద్దతుకు ప్రతీకగా ప్రత్యేక బ్యాగ్‌ని ధరించడం ద్వారా పాలస్తీనాకు తన సంఘీభావాన్ని చూపుతుందని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారతదేశం తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లో పాకిస్తాన్ దళాలను ఓడించిన రోజు 'విజయ్ దివస్' నాడు హమాస్ వంటి సంస్థకు ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ మ...
CAPF Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన
Career

CAPF Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన

Indian Armed Forces : కేంద్ర సాయుధ బలగాలు, (CAPF Jobs) అస్సాం రైఫిల్స్‌ లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో  ఏకంగా లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. గత ఐదు సంవత్సరాల్లో సుమారు  71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు వంటి  కార‌ణాల‌తో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా అక్టోబర్‌ 30 నాటికి ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.సీఏపీఎఫ్‌, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు సీఆర్‌పీఎఫ్‌లో 33,730 సీఐఎస్‌ఎఫ్‌లో 31,782 బీఎస్‌ఎఫ్‌లో 12,808 ఐటీబీపీలో 9,861 ఎస్‌ఎస్‌బీలో 8,646 అస్సాం రైఫిల్స్‌లో 3377 పోస్టులు ఖాళీగా ఉన్న...
Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..
National

Parliament Session | లోక్ సభ సమావేశాల షెడ్యూల్ ఖారారు..

Parliament Session |కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత  మోదీ 3.0 కేబినెట్‌లో 71 మంది ఎంపీలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు (Parliament Session) ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు జూన్‌ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు ((Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం ప్రకటించారు. అయితే లోక్‌సభ (Lok Sabha) కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను స్పీకర్‌ ను ఎన్నుకోవాల్సి ఉంది.18వ లోక్‌సభ మొదటి సెషన్‌  జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి కిరెణ్‌ రిజుజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన  సభ్యుల ప్రమాస్వీణంతోపాటు  స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని వివరించారు. రాజ్యసభ సెషన్  జూన్‌ 27 నుంచి జూలై 3 వరకు  నిర్కొవహించనున్నట్లు ...
New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..
Trending News

New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..

CJI Justice Chandrachud | భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్..  దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు (New Criminal Justice) అమలులోకి రావడాన్ని ప్రశంసించారు. భారతదేశం పురోగమిస్తోంది అనడానికి ఇది "స్పష్టమైన సూచన" అని అన్నారు.  క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని అందుకు భారతదేశం కూడా సర్వన్నద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యాధారాల చట్టం (BSA) పై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ ఈ కీలక సదస్సును శనివారం నిర్వహించింది.ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క...
ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..
National

ADR Report | లోక్ స‌భ మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో 16% మందిపై క్రిమినల్ కేసులు.. ఇంకా షాకింగ్ వివరాలు..

ADR Report | రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మొద‌టి ద‌శ‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల‌ల్లో 16 శాతం మంది (1,618 మందిలో 252 మంది) క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మొద‌టి ద‌శ ఎన్నిక‌ల్లో 1,618 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీలు)లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.అయితే ADR Report ప్రకారం.. క్రిమినల్ కేసులు ఉన్న 252 (16%) అభ్యర్థులలో, 161 (10%) వారిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నారు. అందులో, ఏడుగురు హత్యకు సంబంధించిన కేసులు, 18 మంది మహిళలపై అత్యాచారం వంట...
Budget 2024 Highlights :  వందే భారత్‌ కోచ్‌ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి.. ఉచిత సోలార్ విద్యుత్
National

Budget 2024 Highlights : వందే భారత్‌ కోచ్‌ల తరహాలో 40వేల బోగీల అభివృద్ధి.. ఉచిత సోలార్ విద్యుత్

Budget 2024 Highlights: సౌర విద్యుత్ ను ప్రోత్సహించే లక్ష్యంతో రూఫ్ టాప్ సోలారైజేషన్ విధానం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమెకు ఇది ఆరో బడ్జెట్ కాగా. ఈ సందర్భంగా ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు. అ వివరాలు.. ఉచిత సౌర విద్యుత్ దేశ వ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ రూఫ్‌ టాప్‌ సిస్టమ్‌ను బిగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఆయా కుటుంబాలు పొందగలుగుతాయన్నారు. దీంతో ప్రతీ కుటుంబానికి ఏటా రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా చేసే వీలుకలుగుతుంది. మిగులు విద్యుత్ ను విద్యుత్‌ను పంపిణీ సంస్థల(డిస్కమ్ )కు విక్రయించుకోవచ్చని ఆమె చెప్పారు. ఇటీవల అయోధ్య రామ మందిరం నే...
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
National

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.  చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా  215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు పూర్తి చట్టంగా మారుతుంది. కాగా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్లు అమలు కావడానికి సంవత్సరాలు పడుతుంది. తర్వాతి జనాభా గణంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్యయ్యాకే మహిళా రిజర్వేషన్ (Women's Reservation Bill) అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సుమారు 10 గంటల పాటు సుదీర్...