Thursday, June 19Thank you for visiting

Tag: Pahalgam terror attack

Operation Sindoor : పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చిశాం..

Operation Sindoor : పాకిస్తాన్ జెట్ విమానాలను కూల్చిశాం..

National
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని హైటెక్ ఫైటర్ జెట్‌ (Pakistani Planes)లను భారత్ కూల్చివేసిందని. దీనిని నిర్ధారించడానికి భారత వైమానిక దళం సాంకేతికంగా పరిశీలిస్తోందని ఆదివారం IAF ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వైపు కూడా స్వల్పంగా నష్టాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. అయితే మన ఫైటర్ పైలట్లు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారని చెప్పారు.న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎకె భారతి, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద పాల్గొన్నారు. "మా (PAF) విమానాలు మా గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించబడినందున మా వద్ద శిథిలాలు లేవు. కానీ మేము కొన్ని విమానాలను కూల్చివేసాము. నా దగ్గర సంఖ్యలు ఉన్నాయి మరియు దానిని నిర్ధారించడానికి మేము సాంకేతిక వివరాలలోకి ప్రవేశిస్తున్నాము...
BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

National
India's BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని "యుద్ధ చర్య"గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి.భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) మరియు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది....
పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

National
Operation Sindoor Live : పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam Attack) కి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, శిక్షణా శిబిరమైన మురిడ్కేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఐదుగురిలో భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో అబు జుందాల్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, యూసుఫ్ అజార్, అబు ఆకాషా మరియు మహ్మద్ హసన్ ఖాన్ హతమయ్యారని ఈ రోజు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. హతమైన ఉగ్రవాదులలో పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ భారతదేశంపై ఉగ్రవాద చర్యలకు కుట్ర పన్నుతున్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కమాండర్లు ఉన్నారు.ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఐదురుగు ఉగ్రవాదులు వీరే:ముదస్సర్ ఖాదియన్ ఖాస్ (అబు జుందాల్)ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ లష్కరే తోయిబాతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఉగ్రవాది మురిడ్కేలో ఉ...
Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్

Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్

National, Trending News
Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్‌ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్‌ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌ (Uri Sector) లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి చిన్న ఆయుధాలు మిసైల్స్ కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం దానికి అనుగుణంగా స్పందిస్తోంది. భారతదేశ పశ్చిమ సరిహద్దులో ఒక పెద్ద దాడిలో, పాకిస్తాన్ సైన్యం మే 7, 8న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి వివరాలు వెల్లడించారు.మొత్తం 36 ప్రదేశాలలో 300 నుంచి 400 డ్రోన్‌లను పాక్ మోహరించిందని, వాటిలో చాలా వాటిని భారత దళాలు కూల్చేశాయని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ డ్రోన్‌లు టర్కిష్-నిర్మిత అసిస్‌గార్డ్ సోంగర్ మోడల్‌ గా గుర్తించామని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీ-క్యాలిబర్ ఆయుధాలను కూడా ప్రయోగించింది....
India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..

India Pakistan War | భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ క్షిపణులతో దాడులు..

National
దీటుగా స్పందించిన భారత రక్షణ వ్యవస్థలుIndia Pakistan War | పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇచ్చింది. అదే సమయంలో, పాకిస్తాన్ కూడా భారతదేశంపై పిరికితనంతో దాడి చేసింది. పూంచ్‌లో జరిగిన దాడిలో సాధారణ పౌరులు మరణించారు. నిన్న రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి భారతదేశంలోని అనేక నగరాలపై క్షిపణులు ప్రయోగించింది అయితే, భారత సైనిక వీరులు వాటన్నింటినీ గాల్లోనే నాశనం చేశారు. ప్రెస్ మీటింగ్‌లో అన్ని పరిణామాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని MEA పంచుకుంది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి(sofia qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (vyomika singh) పూర్తి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష...
పాకిస్తాన్‌లో వైమానిక దాడి..  25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

పాకిస్తాన్‌లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

National
Indian Army Press Conference : పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్ల‌డించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయ‌డానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ప్రెస్ మీటింగ్ ప్రారంభంలో 2001 పార్లమెంటు దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడి, ఉరి, పుల్వామా మరియు పహల్గామ్ దాడులతో సహా భారతదేశంపై జరిగిన వివిధ దాడులకు సంబంధించిన క్లిప్‌ను కూడా ప్రదర్శించారు.ఆర్మీ ఎక్కడ ఎందుకు దాడి చేసింది?ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర...
Operation Sindoor :  ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?

Operation Sindoor : ఉగ్ర శిబిరాలు ధ్వంసం, 90 మంది ఉగ్రవాదులు హతం?

National, Trending News
Operation Sindoor Live updates : పహల్గామ్ లో 26 మంది అమాయకుల ఊచకోతకు ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో 90 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న క్రూరమైన పహల్గామ్ ఊచకోతకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (Pok)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు (Operation Sindoor) నిర్వహించింది. వీటిలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంగా పిలువబడే బహల్పూర్ కూడా ఉంది.పాకిస్తాన్, పీఓకేలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడులు (India Attacks Pakistan) నిర్వహించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్‌ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పాలనే దానిపై నిరంతరం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో భారత సైన్యం పాకిస్తాన్, పిఓకె(POK)లో బుధవారం ...
భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

National
Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. 'Operation Sindoor' కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.పాకిస్తాన్ (Pakistan), పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి, కీలకమైన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి వరుస వైమానిక దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున...
Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..

Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..

National
PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus water treaty) పై కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో భారతదేశంలోని నీరు బయటకు వెళ్లేది. కానీ ఇప్పుడు దానిని భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు భారతదేశానికి హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుంచి బయటకు వెళ్లిపోయేదని ఆయన అన్నారు. ఇప్పుడు భారతదేశ జలాలు దేశ ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి. దేశానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.దేశంలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదు. మునుపటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు ప్రపంచం ఏమి చెబుతుందో ఆలోచి...
MHA : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

MHA : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

National
India-Pakistan Tensions : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రు దాడి జరిగినప్పుడు అన్ని విధాలా సర్వసన్నద్దంగా ఉండడానికి ప్రజల్లో అవగాహనను పెంచడానికి మే 7, బుధవారం సమగ్ర పౌర రక్షణ మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.పాకిస్తాన్‌ -భారత్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ (MHA) రాష్ట్రాలకు సూచించింది. యువత, విద్యార్ధులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్‌ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే ఈ అంశంపై అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లోని విద్యార్ధులకు ఇప్పటికే అవగ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..