Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Old city

Metro Phase-2 Update | ఓల్డ్ సిటీలో ఊపందుకున్న ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట  మెట్రో పనులు
National

Metro Phase-2 Update | ఓల్డ్ సిటీలో ఊపందుకున్న ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మెట్రో పనులు

Hyderabad Metro Phase-2 Update | హైదరాబాద్ పాతబస్తీలోని ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (MGBS - Chandrayangutta) మార్గంలో ఏడున్నర కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది. మెట్రో నెట్‌వర్క్ సకాలంలో విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి.ఆస్తుల సేకరణలో పురోగతిహైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి 1,100 గుర్తించిన ప్రభావిత ఆస్తుల సేకరణ శరవేగంగా సాగుతున్నట్లు ధృవీకరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో సహకరిస్తూ భూసేకరణ ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి గాను ఎన్విఎస్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.మొత్తం ఆస్తుల్లో 900కు సంబంధించి భూసేకరణ చట్టం కింద ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. దశలవారీగా 800 ప్రాపర్టీలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌లు జారీ చేశా...
Metro Phase – 2 |  హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణలో కొత్త రూట్లు ఇవే..
Telangana

Metro Phase – 2 | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణలో కొత్త రూట్లు ఇవే..

Metro Phase - 2 | హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులతో నిత్యం సతమతమవుతున్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త మార్గాల ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ కొత్త మార్గాలు ఈ వ్యూహాత్మక విస్తరణ హైదరాబాద్‌లోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైల్ సేవలను అందించడంతోపాటు నగరం నాలుగు మూలల నుంచి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టున్నారు. గత ప్రతిపాదనలు రద్దు.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ మార్గాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర జనాభాలో ఎక్కువ మంది ప్రజల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రత్యామ్నాయ మార్గాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేయనుంది. కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ 15 శాతం, ర...
Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..
Telangana

Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..

హైదరాబాద్ : హైద‌రాబాద్‌ పాతబస్తీ (Hyderabad Old City) లో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూఢిల్లీలో ఇటీవ‌ల విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్‌గా, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. సేకరించిన మొత్తంలో 75% రాష్ట్ర ఖజానాకు, మిగిలిన 25% అదానీకి వస్తాయని రేవంత్ వెల్ల‌డించారు. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అదానీ గ్రూపు ఆమోదం తెలిపింద‌ని, కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. బిల్లుల వసూలంటే ముచ్చమటలే.. కాగా హైద‌రాబాద్ పాత బ‌స్తీలో విద్యుత్ బిల్లుల వ‌సూలు ప్ర‌క్రియ అత్యంత స‌వాల్ తో కూడుకున్న‌ది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్‌ సిబ్బందిపై దాడులు చేయడం వం...
Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..
Telangana

Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

New Metro line in Old City | పాత‌బ‌స్తీ వాసుల చిరకాల స్వ‌ప్నం నెర‌వేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించ‌నున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్స‌రాలుగా అక్క‌డ‌ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్‌ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో క‌ద‌లిక వ‌చ్చింది.మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్...