జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir
హర్యానాలో 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనంJammu Kashmir | అనంత్నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో విస్తృత శోధనలు చేపట్టి, ఒక అస్సాల్ట్ రైఫిల్, సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్కి సంబంధించి ఇప్పటికే అదుపులో ఉన్న రెండో వైద్యుడు అందించిన సమాచారంతో ఈ రికవరీ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ముందు అనంత్నాగ్ జీఎంసీ (GMC)లోని డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ లాకర్ నుంచి AK–47 రైఫిల్ స్వాధీనం చేసుకున్న విషయం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదీల్ అరెస్టు తర్వాత రెండవ వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తుదర్యాప్తు అధికారుల ప్రకారం, ముగ్గురు వైద్యులపై ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. వీరిలో అనం...

