భారత్పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం
National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ గ్రూప్ సుల్తానత్-ఎ-బంగ్లా. భారత దేశ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచడమే ఈ గ్రూప్ ఏకైకలక్ష్యం.భారతదేశ చికెన్-నెక్పై బెదిరింపుయూనస్ గతంలో చేసిన వ్యాఖ్యలూ భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అతను చైనా పర్యటన సందర్భంగా సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)పై వ్యాఖ్యానిస్తూ, ఈశాన్య రాష్ట్రాలు “భూపరివేష్టితమై ఉన్నాయి” అని వ్...


