
Medaram Jatara 2026 : దక్షిణ కుంభమేళాకు సర్వం సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఇవే!
28న కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక జాతర ఆరంభం29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క కుంకుమ గద్దెపైకి.. ఇదే ప్రధాన ఘట్టం30న భక్తుల దర్శనం31న అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తంవరంగల్/ములుగు: తెలంగాణ కుంభమేళా, కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతర (Medaram Jatara 2026)కు ములుగు జిల్లా మేడారం ముస్తాబైంది. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేసింది.నేడే తొలి ఘట్టం: పగిడిద్దరాజు, జంపన్నల ఆగమనంజాతరలో మొదటి రోజైన బుధవారం అత్యంత కీలకమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి:పగిడిద్దరాజు రాక: మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి, కాలినడకన మేడారానికి తీసుకువస్తారు. గద్దెలపై పగిడిద్దరాజును ప్రతిష్ఠించడంతో జాతర అధి...
