Maha Shivaratri : భక్తులకు శుభవార్త.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..
Maha Shivaratri : శివరాత్రి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించేవదుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం (vemulawada temple) లో మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో టీఎస్ ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపనుంది.వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల కోసం 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లించారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9వ తేదీన 329 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు వరం...