
1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్లోని శారదా మందిర్లో తొలిసారిగా నవరాత్రి పూజలు
Kashmir : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని శారదా మందిర్(Sharda Mandir )లో 1947 తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రి పూజలు జరుగుతున్నాయి.
ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని తీత్వాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ పూజలో పలువురు కాశ్మీరీ పండిట్లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.
ఈ ఆలయం 1947 దాడుల్లో ధ్వంసమైంది. దేశ విభజనకు ముందు రోజులలో ఉన్న అదే నిర్మాణ శైలిలో, అదే స్థలంలో పునర్నిర్మించబడింది. ఈ ఏడాది మార్చి 23న నవేరి- కాశ్మీరీ కొత్త సంవత్సరం సందర్భంగా, అలాగే జూన్లో శారదా దేవి విగ్రహానికి అభిషేకం, ప్రాణ-ప్రతిష్ట జరిగినప్పడు ఆలయాన్ని తెరిచారు.ఇక దసరాను పురస్కరించుకొని శారదా మందిర్లో అక్టోబర్ 15 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. ఈ ఆలయంలో పూజలు నిర్వహించడ...