ఐపీఎల్ మ్యాచ్ల కోసం మెట్రో రైళ్ల షెడ్యూల్ లో మార్పు..
Hyderabad Metro Rail Shedule : హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం సమయాన్ని పొడిగిస్తూ మెట్రో యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇకపై చివరి మెట్రో రైలు 12 :15 గంటలకు బయలు దేరి 1:10 గంటలకు గమ్యం చేరుకోనుంది.అయితే ఇక్కడ గమనించాల్సిందేమిటంటే నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులో ఉంటుంది. ఇది ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచులు వీక్షించేవారికి.. ఆ మార్గాల గుండా ప్రయాణించేవారికి ఉపయోగపడుతుంది. మార్చి 22న నుంచి -2025 సీజన్ స్టార్ట్ అవుతున్న క్రమంలో హైదరాబాద్ మెట్రో ఈ సౌకర్యాన్ని కల్పించింది. మార్చి 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేవరకు ఆ స్టేషన్ల గుండా చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు మొదలై.. రాత్రి 1.10 గంటలకు ...