
Ayushman Bharat | కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు
Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ( AB - PMJAY ) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18న జాతీయ ఆరోగ్య అథారిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనుందని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి.Ayushman Bharat : మార్చి 18 ఒప్పందంఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసిన 35వ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ (Delhi ) అవతరిస్తుంది. కాగా ఈ పథకాన్ని స్వీకరించని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మార్చి 18న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నామని, ఐదు కుటుంబాలకు AB-PMJAY కార్డులు అందజేయనున్నామని, తద్వారా వారు ఈ పథకం లబ్ధిదారులుగా మారతారని అధికా...