EPF Rules 2024 | ఏళ్ల తరబడి పీఫ్ క్లెయిమ్ కోసం తిరిగాడు.. చివరకు అతడు చనిపోయాకే స్పందించిన అధికారులు
Kochi : కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఈపీఎఫ్ పొదుపు చేసుకున్నాడు. చివరకు ఉద్యోగ విరమణ తర్వాత ఆ డబ్బులను డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు. అయితే క్లెయిమ్ కోసం ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు డాక్యుమెంటేషన్ లోపాలను ఎత్తిచూపుతూ అతని క్లెయిమ్ లను తిరస్కరించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఈపీఎఫ్ అధికారులు ఎటువంటి అదనపు పత్రం సమర్పించకుండానే ప్రావిడెంట్ ఫండ్ చెల్లించేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. అధికారులు కనీసం మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా అడగలేదు. మృతుడు 69 ఏళ్ల కెపి శివరామన్ (K P Sivaraman) కుమారుడు ప్రదీష్ తెలిపారు. ఈపీఎఫ్ అధికారుల తీరుతో విసిగిపోయిన కెపి శివరామన్ గత నెలలో కొచ్చిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఓ) కార్యాలయంలో విషం ఆత్మహత్యకు పాల్పడ్డాడు .శివరామన్ మరణం తర్వాత అతడి కుటుంబానికి పెండింగ్లో ఉన్న ...