Sunday, February 15"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Corona Cases

Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

Corbevax Vaccine ‌: హైదరాబాద్ కోర్బీవ్యాక్స్ టీకాకు డ‌బ్ల్యూహెచ్‌వో అనుమ‌తి

National
 Corbevax Vaccine ‌: హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ దేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకా (Corbevax Vaccine) కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్ ఫాంపై స్వదేశీయంగా రూపొందించిన తొలి దేశీ కొవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కోర్బీవ్యాక్స్ కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి లభించింది. ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ల కోర్బీవ్యాక్స్ కొవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందించింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల కోసం వినియోగించారు. కాగా తమ వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకంగా ఉందని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ తో తమ కంపెనీ కొవిడ్ 19 టీకాల ఉత్పత్త...
Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

Andhrapradesh, Telangana
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona Cases) రోజురోజుకు భారీగా పెరుగుతోంది.తాజాగా 800 కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 798 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్ లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక గురువారం ఒక్కరోజే ఐదు గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కొత్త వేరియంటే కారణమని తెలుస్తోంది.. తెలంగాణలోనూ కరోనా సమాచారంపై దాపరికం.. తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిప్తోంది ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప...
Corona virus | మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి

Corona virus | మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి

Telangana
గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదు తెలంగాణలో కొవిడ్ చికిత్స పొందుతున్న 14 మందిభారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 358 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోవిడ్ తో ఆరుగురు మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 14 కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను మొదటిసారి కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కేవలం హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా నియంత్రణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుక...