Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: CM Siddaramaiah

Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..
National

Mallikarjun Kharge | చిక్కుల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే..

Mallikarjun Kharge : ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. ఈ వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుండ‌గా మ‌రో వివాదం అక్క‌డి హ‌స్తం పార్టీకి కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్‌ పార్క్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు ఏకంగా 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం దుమారం రేపుతున్న‌ది. ఖర్గే కుమారుడు రాహుల్‌ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) భూ కేటాయించ‌డం అధికార దుర్వినియోగమని, కర్ణాటక ప్ర‌భుత్వం బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వీయ ఎక్స్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేశారు.ఈ వివాదంపై మ‌ల్లికార్జున‌ ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధా...
Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా
National

Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా

Valmiki corporation scam | క‌ర్ణాట‌క‌లో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభ‌కోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం మొద‌టి నుంచి మంత్రి బి. నాగేంద్ర రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేశాయి. దీంతో నాగేంద్ర మంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటానికి నాగేంద్ర రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. మే 26న కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎమ్‌విఎస్‌టిడిసి) సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ విషాదకరమైన ఆత్మహత్య తర్వాత ప్రతిప‌క్ష‌ బిజెపి ముప్పేట దాడి చేసింది.చంద్రశేఖరన్‌ మృతితో కార్పొరేషన్‌ పరిధిలోని నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా నిధుల బదిలీ చేసేందుకు సీనియర్ అధికారులు...