Boat Storm Connect Plus Smartwatch
బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ను భారతదేశంలో ఆవిష్కరించారు. స్మార్ట్ వాచ్ లో 1.91-అంగుళాల డిస్ ప్లే 550 నిట్స్ వరకు బ్రైట్ నెస్, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 2.5D కర్వ్డ్ గ్లాస్ తో ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాల్స్సమయంలో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తొలగిస్తుంది. కంపెనీ ENx అల్గారిథమ్ తో పాటు బ్లూటూత్ కాలింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. హృదయ స్పందన ట్రాకర్, SpO2 మానిటర్ తో సహా హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు దీనిలో ఉంటాయి.ధర, లభ్యతభారతదేశంలో బోట్ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,999. ఇది ప్రారంభ ధర అని కంపెనీ చెబుతోంది. పరికరం రిటైల్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇది యాక్టివ్ బ్లాక్, యాక్టివ్ బ్లూ, కూల్ గ్రే మెరూన్ అనే నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను అధికారిక బోట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
...