BMC Elections 2026 | ముంబై మున్సిపల్ పోరు: బీజేపీ, షిండే సేన మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. ఫార్ములా ఇదే!
BMC Elections 2026 | ముంబై: దేశంలోనే అత్యంత సుసంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార 'మహాయుతి' కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది.సీట్ల పంపకాలు ఇలా..మహాయుతి వర్గాల ప్రకారం, మొత్తం 227 సీట్లలో:భారతీయ జనతా పార్టీ (BJP): 140 స్థానాల్లో పోటీ చేయనుంది.శివసేన (షిండే వర్గం): 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 200 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని, కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.ఎన్నికల షెడ్యూల్:పోలింగ్ తేదీ: జనవరి 15, 2...

