ADR Report
లోక్సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు
2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్లడిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చదివినట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ […]
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు
Third Phase Voting : లోక్సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది ‘కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి […]
ADR report | 17వ లోక్సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..
ADR Report | న్యూఢిల్లీ: 17వ లోక్సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) విశ్లేషణలో వెల్లడైంది. లోక్సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అత్యధికంగా 410 ప్రశ్నలు అడిగారు. అప్నా దళ్ (సోనీలాల్)కు చెందిన ఇద్దరు ఎంపీలు కనీసం ఐదు అడిగారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధవారంప్రచురించిన […]
