
Vande Mataram New Guidelines : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అధికారిక కార్యక్రమాల్లో 6 చరణాలు తప్పనిసరి!
Vande Mataram New Guidelines : భారత స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన "వందేమాతరం" గేయం రచించబడి 150 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.కొత్త మార్గదర్శకాలు ఇవే..కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ప్రోటోకాల్ ప్రకారం వందేమాతరం ఆలపించే విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి:ఆరు చరణాలు : ఇప్పటివరకు ఉన్న సంప్రదాయానికి భిన్నంగా, ఇకపై ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలలో వందేమాతరం యొక్క అధికారిక ఆరు చరణాలను పాడటం లేదా ప్లే చేయడం తప్పనిసరి.పెరిగిన వ్యవధి: పూర్తిస్థాయి చరణాల ఆలాపన నేపథ్యంలో దీని వ్యవధిని 3 నిమిషాల 10 సెకన్లకు పెంచారు.గౌరవ సూచికంగా నిలబడాలి: అధికారిక కార్యక్ర...
