
అయోధ్య రామాలయం: లక్షల కోట్ల ఆదాయం.. IIM లక్నో రిపోర్ట్! | Ayodhya Economy Case Study
Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే పరిమితమవకుండా, అయోధ్య ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తోంది. ఐఐఎం (IIM) లక్నో ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, రామాలయం ఇప్పుడు ఒక శక్తివంతమైన 'ఎకనామిక్ ఇంజిన్ గా అవతరించింది.పర్యాటక విస్ఫోటనం - ఆదాయ వర్షంరామాలయ ప్రతిష్టకు ముందు, అయోధ్య ప్రధానంగా పవిత్ర తీర్థయాత్రా స్థలంగా గుర్తించేవారు. పర్యాటకుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. ఉపాధి అవకాశాలు కూడా తక్కువగా ఉండేవి. ఆర్థిక కార్యకలాపాలు సైతం అంతంతమాత్రమే.. ఇక రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల వృద్ధి అంతగా లేదు. ఇక బాలరాముడి ప్రతిష్ఠ తర్వాత, అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరిగాయి. సగటున, ప్రతిరోజూ 200,000 కంటే ఎక్కువ మంది భక...
