Wednesday, April 23Welcome to Vandebhaarath

Medicines Price Reduced | గుడ్ న్యూస్.. మధుమేహం, కాలేయం, గుండె జబ్బులతో సహా 41 మందుల ధరలను తగ్గించిన కేంద్రం 

Spread the love

Medicines Price Reduced : మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 మందుల ధరల కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మధుమేహం, బాడీ పెయిన్, లివర్ సమస్యలు, యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన మందులు, ఫార్ములేషన్‌ల ధరలను త‌గ్గించిన‌ట్లు పేర్కొంది.

వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే అందజేయాలని ఫార్మా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్‌పిపిఎ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఔషధాల ధరల తగ్గింపుతో దేశంలో సుమారు 10 కోట్ల మందికి పైగా ప్ర‌యోజ‌నం పొందే అవ‌కాశం ఉంద‌ని కేంద్రం అంచానా వేసింది. గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది.

READ MORE  అరెస్ట్‌ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్‌ బెయిల్‌ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *