Crime

Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?

Spread the love

Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్​ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు వరుసగా మృత్యువాతపడుతుండడం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది.

ఆస్పత్రిలో ఏం జరుగుతోంది.

నాందేడ్​లో ఉన్న డాక్టర్ శంకర్​రావ్​ చవాన్​ ప్రభుత్వ దవాఖానాలో సెప్టెంబరు 30- అక్టోబరు 1 మధ్యలో ఇక్కడ 24 మంది రోగులు చనిపోయినట్లు సోమవారం సాయంత్రం వార్త వెలుగులోకి వచ్చింది. 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు మరణించడం సంచలనం రేపింది. ఈ 24 మందిలో 12 మంది శిశువులు కావడం అత్యంత విషాదకరం. మరో 12 మందిలో ఐదుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో నలుగురు.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఓ వ్యక్తి విష పదార్థం తీసుకోవడంతో ఆస్పత్రిలో చేరాడు. ఒకరికి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయి. మరో ఇద్దరు కిడ్నీ రోగులు ఉన్నారు. మూడు యాక్సిడెంట్​ కేసులు ఉన్నాయి.

Nanded hospital news today : ఇదిలా ఉండగా అక్టోబరు 1- 2 తేదీల మధ్యలో మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. అంటే.. 48 గంటల్లో 31మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మొత్తం 31 మందిలో 16 మంది పసికందులు- చిన్నారులు ఉన్నట్టు సమాచారం. “సెప్టెంబర్​ 30- అక్టోబరు​ 1 మధ్యలో 24 మంది మరణించారు. అక్టోబర్​ 1 నుంచి 2 మధ్యలో ఏడుగురు మృతి చెందారు. ఎవరూ ఆందోళన చెందవద్దు.. వైద్య నిపుణుల బృందం సిద్ధంగా ఉంది,” అని అధికారులు వెల్లడించారు.

అయితే ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత రావడం లేదు. ఔషధాల కొరత ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. కాగా వీటిని ఆసుపత్రి సిబ్బంది ఖండించింది. “ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించలేదు. కావలసినన్ని ఔషధాలు కూడా ఉన్నాయి. చికిత్స ఎంత అందించినా రోగులు రికవర్​ కావడం లేదు.” అని నాందేడ్​ ప్రభుత్వ ఆస్పత్రి డీన్​ శ్యామ్​రావ్​ వకోడే మీడియాకు వెల్లడించారు.

నాందేడ్​ ఆసుపత్రిలో రోగుల మృతి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ప్రభుత్వాధికారులు చెప్పారు. ముగ్గురు సభ్యుల బృందం దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఓ నివేదిక సమర్పిస్తారని, అందులో కీలక విషయాలు బయటపడతాయని అధికారులు అంటున్నారు. మరోవైపు.. ఈ హాస్పిటల్ లోని మరో 71 మంది రోగుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *