Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

MHA : భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

Spread the love

Highlights

India-Pakistan Tensions : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రు దాడి జరిగినప్పుడు అన్ని విధాలా సర్వసన్నద్దంగా ఉండడానికి ప్రజల్లో అవగాహనను పెంచడానికి మే 7, బుధవారం సమగ్ర పౌర రక్షణ మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

పాకిస్తాన్‌ -భారత్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో వైమానిక దాడులు జరిగితే ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ (MHA) రాష్ట్రాలకు సూచించింది. యువత, విద్యార్ధులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్‌ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే ఈ అంశంపై అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లోని విద్యార్ధులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రువుల దృష్టి మరల్చడం తదితర కీలక అంశాలపై అవగాహన కల్పిస్తారు. 1971 యుద్దం తరువాత దేశంలో తొలిసారి ఈ స్థాయిలో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నారు.

ఈ డ్రిల్ వివిధ రకాల కీలకమైన సంసిద్ధత చర్యలపై దృష్టి సారిస్తాయి. వీటిలో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్‌లను మోగించడం తోపాటు విద్యార్థులు, ప్రజలకు అవసరమైన రక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైమానిక దాడులు లేదా ఇతర శత్రు సంఘటనలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునే జ్ఞానాన్ని వారికి అందించడం దీని లక్ష్యం.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *