Wednesday, December 31Welcome to Vandebhaarath

Pamban Rail Bridge : త్వరలో ప్రారంభం కానున్న పంబన్ వంతెన ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Spread the love

Rameshwaram : భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన పంబన్ రైలు వంతెనను (Pamban Rail Bridge) ఆదివారం (ఏప్రిల్ 6) రామ నవమి (Ram Navami) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తమిళనాడు(Tamilnadu)లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి రోడ్డు వంతెనపై నుంచి జెండా ఊపి వంతెన పనితీరును వీక్షిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత, ఆయన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. “ఈ వంతెన లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభించబడింది.

Pamban Rail Bridge పంబన్ బ్రిడ్జి ప్రత్యేకతలు

రామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానిస్తూ రూ.550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.08 కి.మీ., 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ కలిగి ఉంది. అపార్ట్ మెట్లలో లిఫ్ట్ ల మాదిరిగా ఈ వంతెన 17 మీటర్ల ఎత్తు వరకు పైకి వెళుతుంది. ఇలా పైకి వెళ్లి నపుడు భారీ ఓడలు బ్రిడ్జి కింది నుంచి సులభంగా రాకపోకలు సాగిస్తాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ రీన్‌ఫోర్స్‌మెంట్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్‌లతో నిర్మించబడిన ఈ వంతెన చాలా పటిష్టంగా నిర్మించారు.భవిష్యత్ డిమాండ్లను తీర్చడానికి ఇది డ్యూయల్ రైలు ట్రాక్‌ల కోసం రూపొందించారు. ప్రత్యేక పాలీసిలోక్సేన్ పూత వల్ల తప్పు పట్టే ప్రమాదం ఉండదు.కఠినమైన సముద్ర వాతావరణంలో కూడా చాలా ఏళ్ల వరకు మన్నికగా ఉంటుంది.

ఆ కాలంలో ఇంజనీరింగ్ అద్భుతమైన పంబన్ రైలు వంతెన 1914లో ప్రారంభించారు. దాని దశాబ్దాల పాటు సేవలు అందించిన ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. తుప్పు పట్టిపోయి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో 2022 డిసెంబర్ లో దీనిని వినియోగించకుండా నిషేధించారు. దీని మూసివేతతో రామేశ్వరం పుణ్యక్షేత్రానికి రైలు కనెక్టివిటీ నిలిచిపోయింది. ఇది ప్రయాణికులపై ప్రభావం చూపింది. తాజాగా కొత్త వంతెన ప్రారంభంతో ఈ కీలకమైన కనెక్టివిటీ మళ్లీ అందుబాటులోకి రానుంది.

కొత్త పంబన్ వంతెన యొక్క ముఖ్య లక్షణాలు

  • Pamban Rail Bridge నిలువు లిఫ్ట్ స్పాన్‌ను కలిగి ఉంది, దీనిని కేవలం ఐదు నిమిషాల్లో పెంచవచ్చు, తద్వారా ఓడలు ప్రయాణించవచ్చు. ఇది భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ వంతెన అవుతుంది.
  • గాలి వేగం గంటకు 58 కి.మీ లేదా అంతకంటే ఎక్కువకు చేరుకున్నప్పుడు లిఫ్టింగ్ యంత్రాంగాన్ని ఆపరేట్ చేయలేము, ఇది అక్టోబర్, ఫిబ్రవరి మధ్య తరచుగా జరుగుతుంది.
  • రైళ్లు ఇప్పుడు గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణించగలవు, ఇది గతంలో ఉన్న వంతెనపై గంటకు 10 కి.మీ పరిమితితో మాత్రమే ప్రయాణించేవి.
  • సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో ఉన్న దీని క్లియరెన్స్ పాత వంతెన యొక్క 1.5 మీటర్ల క్లియరెన్స్‌ను అధిగమిచింది. దీంతో పెద్ద ఓడలు కూడా బ్రిడ్జి కింది నుంచి వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది.
  • కఠినమైన తీరప్రాంత పరిస్థితులను తట్టుకునేలా నిర్మించబడిన ఈ వంతెన స్టెయిన్‌లెస్ స్టీల్ రీన్‌ఫోర్స్‌మెంట్‌లు, కాంపోజిట్ స్లీపర్‌లను కలిగి ఉంటుంది.

పూజనీయమైన రామనాథస్వామి ఆలయానికి నిలయమైన రామేశ్వరం (Rameshwaram) ఒక ప్రధాన హిందూ తీర్థయాత్ర గమ్యస్థానం. కొత్త వంతెన ప్రారంభంతో, రామేశ్వరం-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం-కన్యాకుమారి ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ వంటి రైలు సేవలు తిరిగి ప్రారంభమవుతాయి, ఇది యాత్రికులకు, పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మెరుగైన కనెక్టివిటీ స్థానిక వ్యాపారాలు, పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

శ్రీరామ నవమి (Ram Navami) సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించే ఇతర కీలక ప్రాజెక్టుల విషయానికొస్తే జాతీయ రహదారి (NH) 40లోని 28 కిలోమీటర్ల వాలాజాపేట-రాణిపేట సెక్షన్‌ను నాలుగు లేన్లుగా మార్చడానికి, NH-332లోని 29 కిలోమీటర్ల విలుప్పురం-పుదుచ్చేరి సెక్షన్‌ను నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే NH-32లోని 57 కిలోమీటర్ల పూండియంకుప్పం-సత్తనాథపురం సెక్షన్‌ను, NH-36లోని 48 కిలోమీటర్ల చోళపురం-తంజావూరు సెక్షన్‌ను నాలుగు లేన్లుగా మార్చడానికి ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *