Saturday, August 30Thank you for visiting

ఇస్రో కౌంట్‌డౌన్‌ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..

Spread the love

గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత

చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు. శనివారం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఆమె చివరిసారిగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు.
జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు.

తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన వలర్మతి శనివారం సాయంత్రం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. జూలై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్‌గా నిలిచింది. .

ISRO scientist Valarmathi మృతికి ISRO మాజీ డైరెక్టర్ డాక్టర్ PV వెంకటకృష్ణన్ X (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. “శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వాయిస్ ఉండదు. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. ఊహించని మరణం. చాలా బాధగా అనిపిస్తుంది. అని పేర్కొన్నారు.

ఎన్.వలర్మతి ఎవరు?

1959 జూలై 31న జన్మించిన వలర్మతి 1984లో ఇస్రోలో చేరి అనేక మిషన్లలో పాల్గొన్నారు. ఆమె RISAT-1 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం (RIS). అలాగే మన దేశానికి చెందిన రెండవ ఉపగ్రహం. ఏప్రిల్ 2012లో RISAT-1ని విజయవంతంగా ప్రయోగించారు.

అలాగే, 2015లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అబ్దుల్ కలామ్ అవార్డును వలర్మతి అందుకున్నారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *