Friday, April 11Welcome to Vandebhaarath

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

Spread the love

Israel War | లెబనాన్ రాజధాని బీరుట్‌ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ చేప‌ట్టిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah) అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన‌ట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్’ విజయవంతమైంద‌ని ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా (Hassan Nasrallah) మరణించాడన్న వార్తలను హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారు? ఆయ‌న ఆరోగ్య పరిస్థితి గురించి తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ బాంబుల వర్షం కురిపించాయి.

READ MORE  US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం.. రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్

ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాపై త‌మ‌ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడులు ప్రారంభ‌మ‌య్యాయి. నెతన్యాహు సైతం అమెరికా పర్యటనను కుదించుకుని ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ వారంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 720కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్ల‌డించింది. మ‌రోవైపు ఐక్య‌రాజ్య స‌మితి నివేదిక ప్రకారం.. ఘర్షణల నేపథ్యంలో దక్షిణ లెబనాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన వారి సంఖ్య 2,11,000కు చేరింది.

READ MORE  వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు

దాదాపు ఒక సంవత్సరం పాటు గాజా యుద్ధానికి సమాంతరంగా ఇజ్రాయెల్‌ హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేసిన సంఘ‌ర్ష‌ణ‌ అత్యంత శక్తివంతమైనది. నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ ఐదు గంట‌ల‌పాటు నిరంతర దాడులు చేసింది. హెజ్బుల్లా ప్రధాన మద్దతుదారు ఇరాన్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ఘర్షణ అదుపు తప్పుతుందనే భయాలను తీవ్రతరం చేసింది. కాగా శుక్రవారం నాటి దాడి నుంచి వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతం నుండి పారిపోయారు, బీరుట్ డౌన్‌టౌన్, సముద్రతీర ప్రాంతాలలోని ఖాళీ ప్ర‌దేశాల్లో గుమిగూడారు. లెబనాన్‌లోని హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భూ దండయాత్రను కొనసాగించాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ భావిస్తోంది. బీరూట్‌లోని గ్రూప్ సెంట్రల్ హెడ్‌క్వార్టర్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత శుక్రవారం సీనియర్ ఇజ్రాయెల్ అధికారి ఒక‌రు తెలిపారు.

READ MORE  Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *