Friday, April 11Welcome to Vandebhaarath

IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

Spread the love

IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.

కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లు

  • రైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్)
  • రైలు నెం. 04324 (హరిద్వార్-ఢిల్లీ-హరిద్వార్)
  • రైలునెం. 04330 (రిషికేశ్-ఢిల్లీ-రిషికేశ్)
  • రైలు నెం. 04372 (రిషికేశ్-లక్నో చార్‌బాగ్-రిషికేశ్)
  • రైలు నెం. 04370 (రిషికేశ్-బరేలీ-రిషికేశ్)
READ MORE  Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరో పిడుగు.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్సు

మేళా సందర్భంగా, ఉత్తర రైల్వే 14 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంద‌ని, ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుగా 24 రైళ్లకు అద‌న‌పు కోచ్ ల‌ను పెంచుతున్నామ‌ని Northern Railway చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ దీపక్ కుమార్ ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *