India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..
Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే మెట్రో రైలు పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. రెండు నగరాల మధ్య తరచుగా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వందేభారత్ మెట్రో రైలు సేవలందిస్తుంది. భారతీయ రైల్వే నెట్వర్క్లో ఇది మొదటి మెట్రో సర్వీస్.
భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో: మార్గం, షెడ్యూల్
India’s first Vande Bharat Metro: route, schedule దేశంలోని మొట్టమొదటి వందే భారత్ మెట్రో భుజ్-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తుంది. ఇది వారానికి 6 రోజులు నడుస్తుంది.
రైలు భుజ్ నుంచి ఉదయం 5:5 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. వందే మెట్రో రైలు తిరిగి 17:30 గంటలకు అహ్మదాబాద్లో బయలుదేరి 23:10 గంటలకు భుజ్ చేరుకుంటుంది.
గుజరాత్లోని భుజ్ – అహ్మదాబాద్ మధ్య నడిచే మొదటి వందే భారత్ మెట్రో రైలు ఇది.
ఈ వందే మెట్రో రైలు 5 గంటల 45 నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ప్రయాణంలో సగటున 2 నిమిషాల పాటు 9 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు వారానికి 6 రోజులు నడుస్తుంది.
వందే భారత్ మెట్రో: డిజైన్, ఫీచర్లు (India’s first Vande Bharat Metro design, features)
- ఈ వందే మెట్రో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు, వందే భారత్ రైళ్లలో అన్ని ఫీచర్లు ఉన్నాయి.
- ప్రారంభంలో, ఈ రైలు కనీసం 12 వందే మెట్రో కోచ్లతో ప్రారంభించబడుతుంది.
- తర్వాత, భారతీయ రైల్వే.. ఆయా రూట్లలో డిమాండ్కు అనుగుణంగా దీనిని 16 కోచ్లకు విస్తరించవచ్చు.
- ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇందులో నాలుగు కోచ్లు ఒక యూనిట్గా ఉంటాయి.
- ఈ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి.
- ఈ వందే భారత్ మెట్రో రైళ్లు చాలా దూరం ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. 100 కి.మీ నుంచి 250 కి.మీల మధ్య పరిధిని కవర్ చేయగలవు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..