Wednesday, December 31Welcome to Vandebhaarath

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారతే జీవనాడి – India Bangladesh Trade

Spread the love

నిత్యావసరాల నుండి వస్త్ర పరిశ్రమ వరకు అన్నిటిపైనా ఆధారం..

India Bangladesh Trade | న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అస్థిరత, ఉద్రిక్తతలు ఆ దేశ ఆర్థిక పునాదులను వణికిస్తున్నాయి. భౌగోళిక సామీప్యత, తక్కువ రవాణా ఖర్చుల కారణంగా బంగ్లాదేశ్ తన దైనందిన అవసరాల కోసం భారతదేశంపై విపరీతంగా ఆధారపడుతోంది. భారత్ నుంచి సరఫరా నిలిచిపోతే, ఆ దేశంలో ఆహార సంక్షోభం తలెత్తడమే కాకుండా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.

భారత్ నుంచి వెళ్లే కీలక వస్తువులు:

బంగ్లాదేశ్ తన ఆహార భద్రత, పారిశ్రామిక అవసరాల కోసం ఈ క్రింది వస్తువుల కోసం భారత్ వైపు చూస్తుంది.

ఆహార ధాన్యాలు: ఏటా సుమారు 2.1 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు భారత్ నుంచి దిగుమతి అవుతాయి. దీని విలువ సుమారు రూ. 6,575 కోట్లు. అలాగే బియ్యం సరఫరాలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, చక్కెర, సుగంధ ద్రవ్యాల కోసం బంగ్లాదేశ్ మార్కెట్లు పూర్తిగా భారతీయ సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయి.

వస్త్ర పరిశ్రమ (Garment Sector): బంగ్లాదేశ్ GDPలో 11% వాటా కలిగిన వస్త్ర పరిశ్రమకు అవసరమైన ముడి పత్తిలో 35% భారతదేశం నుంచే వెళ్తుంది. భారత్ నుంచి పత్తి ఆగిపోతే ఆ దేశ ఎగుమతులు కుప్పకూలుతాయి.

వైద్యం, విద్యుత్: మందులు, వైద్య సామాగ్రి, ఉక్కు, పెట్రోలియం, విద్యుత్ పరికరాల సరఫరాలో భారత్ అనివార్య భాగస్వామి.

చైనా భారత్‌కు ప్రత్యామ్నాయం కాగలదా?

బంగ్లాదేశ్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, భారత్ ఇచ్చే ‘ధర మరియు వేగం’ చైనా ఇవ్వలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లండన్ కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అభిప్రాయం ప్రకారం, “చైనా నుంచి వస్తువులు రావాలంటే సమయం, ఖర్చు ఎక్కువ అవుతాయి. భారతదేశం వ్యూహాత్మకంగా సరఫరాను నియంత్రిస్తే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.”

అంకెల్లో వాణిజ్య బంధం:
ద్వైపాక్షిక వాణిజ్యం: 2022–23లో $15.9 బిలియన్లు.

అభివృద్ధి సహాయం: గత ఎనిమిదేళ్లలో భారత్ బంగ్లాదేశ్‌కు రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల కోసం $8 బిలియన్ల సహాయాన్ని అందించింది.

సరిహద్దు: బంగ్లాదేశ్ పంచుకునే 4,367 కి.మీ సరిహద్దులో 94% భారత్‌తోనే ఉంది. అంటే భద్రత పరంగా కూడా ఆ దేశం భారత్‌పైనే ఆధారపడాలి.

ప్రస్తుత ఉద్రిక్తతలు – వీసా కేంద్రాల మూసివేత:

ఇరుదేశాల మ‌ధ్య‌ రాజకీయ పరిస్థితులు ప‌త‌మ‌నమైన‌ నేపథ్యంలో చట్టోగ్రామ్, ఢాకాలోని భారత వీసా కేంద్రాలు తదుపరి నోటీసు వరకు మూసివేయబడ్డాయి. సిల్హెట్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్‌ను డిమాండ్ చేసింది.

ముగింపు: బంగ్లాదేశ్ తనను తాను రక్షించుకోవాలన్నా, తన ప్రజలకు తిండి పెట్టాలన్నా భారతదేశంతో సత్సంబంధాలు (India Bangladesh Trade) కొనసాగించడం తప్పనిసరి. ద్వేషపూరిత చర్యలు.. అస్థిరత కొనసాగితే, అది నేరుగా ఆ దేశ సామాన్యుడి కడుపుపై కొట్టడమే అవుతుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *