Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..

Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..

Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. ఇది వన్‌వే ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. రేడియల్‌ రోడ్డులో భాగంగా హెచ్‌సీయూ బస్టాండ్‌ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రాకపోకలు సాగించేలా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. జూన్‌లో ఈ నిర్మాణాన్ని ట్రాఫిక్ కోసం తెరవాల్సి ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల కారణంగా జాప్యం జ‌రిగింది.

READ MORE  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

Gopanpally flyover  హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ IT కారిడార్‌లలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. ఐటీ ఉద్యోగులతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే రహదారి వినియోగదారులకు ఈ నిర్మాణం చాలా ఉపశమనం కలిగిస్తుందని సెరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకెపూడి గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *