Posted in

Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసిసి ఈవెంట్లలో టీమిండియా అరుదైన రికార్డు

Champions Trophy 2025
Champions Trophy 2025
Spread the love

Champions Trophy 2025 | దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ (New Zealand) ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకోవడంతో భారత్ 12 ఏళ్ల వన్డే టైటిల్ కోసం ఎదురుచూపులకు ముగింపు పలికింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. మెన్ ఇన్ బ్లూ జట్టు ఆరు వికెట్లు మిగిలి ఉండగానే 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Highlights

ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ పరుగులో భారతదేశం కొన్ని రికార్డులను సృష్టించింది. భారత జట్టు తమ మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా, పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

పురుషుల క్రికెట్‌ (cricket)లో వరుసగా ఐసిసి టైటిళ్లను గెలుచుకున్న మూడవ జట్టుగా భారత్ ఇప్పుడు నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి 2024లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత, 20 ఓవర్ల ప్రపంచ కప్ తర్వాత తదుపరి ఐసిసి ఈవెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీని వారు ఇప్పుడు గెలుచుకున్నారు.

ఈ అరుదైన ఘనత సాధించిన జట్లుగా భారతదేశం వెస్టిండీస్. ఆస్ట్రేలియా జట్ల సరసన చేరింది. వెస్టిండీస్ 1975, 1979 వన్డే ప్రపంచ కప్‌ల (One day International cricket) తో వరుసగా ఐసిసి ట్రోఫీలను గెలుచుకుంది. ఆసీస్ ఈ అరుదైన ఘనతను రెండుసార్లు సాధించింది. వారు 2006లో ఛాంపియన్స్ ట్రోఫీని, 2007లో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు, తర్వాత WTC 2023 ఫైనల్, ODI ప్రపంచ కప్ 2023ను గెలుచుకోవడం ద్వారా ఈ ఘనతను రిపీట్ చేసింది.

దుబాయ్‌(Dubai)లో జరిగిన మ్యాచ్‌లో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్, చేతిలో నాలుగు వికెట్లు ఉండగానే కివీస్‌ను ఓడించింది. మెన్ ఇన్ బ్లూ జట్టు ఇప్పుడు పోటీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది, 2002లో శ్రీలంకతో పంచుకున్న ఛాంపియన్స్ ట్రోఫీతో సహా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ఫైనల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 83 బంతుల్లో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అతను అందించిన ఆరంభం టీమిండియా లక్ష ఛేదనకు ఎంతో బూస్టింగ్ ఇచ్చింది. రోహిత్ తన భవిష్యత్తు గురించి కూడా మాట్లాడాడు, తన రిటైర్మెంట్ (Retirement) పుకార్లను తోసిపుచ్చాడు. తాను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వబోవడం లేదనని స్పష్టం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *