Wednesday, April 1, 2026
Technology

BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

Spread the love

BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్‌ సంస్థ‌ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చ‌రిత్ర‌లో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G స‌పోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది.

BSNL 15 వేలకు పైగా 4G సైట్‌లను ఇప్పుడు ప్రారంభించింది. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపించబడిన ఈ సైట్‌లు భారతదేశం అంతటా ఫాస్టెస్ట్‌ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా, బిఎస్ఎన్ఎల్ 4G సేవ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో భారతదేశంలో తయారు చేయబడిన పరికరాలు అమర్చారు.

బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్ టైమ్‌లైన్

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్  4G సేవలను ప్రారంభించే షెడ్యూల్‌ను ప్రకటించారు. BSNL 5G సేవలను ప్రవేశపెట్టడానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని జ్యోతిరాదిత్య సింధియా వివ‌రించారు. అంటే మార్చి 2025 నాటికి 4G నెట్‌వర్క్ కోసం మొత్తంగా లక్ష టవర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విస్తరణ పూర్త‌యితే వేగ‌వంత‌మైన‌ డౌన్‌లోడ్‌లు మెరుగైన టెలివిజన్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంద‌ని తెలిపారు.

BSNL 5G రోల్‌అవుట్

4G రోల్‌అవుట్‌తో పాటు, BSNL 5G కోసం పరీక్షను ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల స్వదేశీ సాంకేతికత ఆధారంగా BSNL యొక్క 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించి వీడియో కాల్ చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ.. ఇప్పటికే కొత్త వినియోగదారులకు 5G SIM కార్డ్‌లను అందించడం ప్రారంభించింది, ఇది రాబోయే నెలల్లో 5G సేవను ప్రారంభించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, BSNL 5G స‌ర్వీస్ ను ప్రస్తుతం C-DoT క్యాంపస్‌లో పరీక్షిస్తున్నారు. రాబోయే వారాల్లో అనేక‌ నగరాల్లో పరీక్షించనున్నారు.

ఇదిలా ఉండ‌గా BSNL నెట్‌వర్క్ అభివృద్ధి కోసంకేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 83 వేల కోట్లకు పైగా నిధుల‌ను కేటాయించింది. ఈ భారీ బడ్జెట్ తో BSNL నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో దాని సేవా నాణ్యతను పెంచ‌నున్నారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *