Tuesday, April 29Thank you for visiting

Balochistan | పాకిస్తాన్‌లో ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. బందీలుగా 100 మందికి పైగా ప్రయాణికులు

Spread the love

Breaking News | Balochistan : బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన పాకిస్తాన్ వ్యతిరేక ఆపరేషన్‌లో, క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ చేసింది. 100 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందిని బందీలుగా ఉంచినట్లు BLA వెల్లడించినట్లు తెలిసింది. రైలుపై BLA భారీ కాల్పులు జరిపింది. 400 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారని సమాచారం.

పాకిస్తాన్ రైల్వే నడిపే ప్యాసింజర్ రైలు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి, బలూచిస్తాన్‌లో 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మంగళవారం ప్రకటించుకుంది. రైలును తాము తమ ఆధీనంలోకి తీసుకున్నామని, ఆరుగురు సైనిక సిబ్బంది మరణించారని, 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

READ MORE  US Elections 2024 : అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని హిందువుల పూజలు

జాఫర్ ఎక్స్‌ప్రెస్ పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. బోలాన్‌లోని ధదర్‌లోని మష్కాఫ్‌లో తమ యోధులు “ఖచ్చితంగా ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ (meticulously planned operation) ” నిర్వహించారని BLA ఒక ప్రకటనలో తెలిపింది. “మన స్వాతంత్ర్య యోధులు రైల్వే ట్రాక్‌ను పేల్చివేశారు, జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపాల్సి వచ్చింది. యోధులు వేగంగా రైలును నియంత్రించారు, ప్రయాణికులందరినీ బందీలుగా పట్టుకున్నారు” అని ఆ బృందం ఒక ప్రకటనలో తెలిపింది.

READ MORE  Pakistan Economic Crisis | పాకిస్థాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ చితికిపోవ‌డానికి కార‌ణాలేంటి? మోదీ ప్ర‌భుత్వ వ్యూహం ఫ‌లించిందా!

BLA బృందం కఠినమైన హెచ్చరిక జారీ చేస్తూ, “ఆక్రమిత దళాలు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వందలాది మంది బందీలను ఉరితీయబడతారని, ఈ రక్తపాతానికి బాధ్యత పూర్తిగా ఆక్రమిత దళాలదే” అని పేర్కొంది. మహిళలు, పిల్లలు, బలూచ్ (Balochistan) ప్రయాణీకులను విడుదల చేశామని, మిగిలిన బందీలందరూ పాకిస్తాన్ దళాల సిబ్బందికి సేవ చేస్తున్నారని BLA ఉగ్రవాదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా బలూచ్ అధికారులు లేదా రైల్వే అధికారులు ఇంకా ప్రాణనష్టం, బందీల స్థితిని నిర్ధారించలేదు.

READ MORE  Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..