Wednesday, April 8, 2026
Crime

మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు… పోలీసుల ఎంకౌంటర్ లో హతం..

Spread the love

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో మహిళా కానిస్టేబుల్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్..  పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయోధ్యలోని పురా కలందర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు చనిపోగా ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులునిందితులు ఆజాద్, విషంభర్ దయాల్‌లను ఇనాయత్ నగర్‌లో అరెస్టు చేశారు.

మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారని, ఆమె వారిని అతికించిందని నిందితులు తెలిపారు. దీని తర్వాత, వారు సామూహికంగా మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి, ఆమె తలను కిటికీ కేసి కొట్టి పగులగొట్టారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగా.. వారు ఆమెను బెర్త్ కిందకు నెట్టివేశారు… అనంతరం  అయోధ్యలో రైలు పూర్తిగా ఆగకముందే ముగ్గురు నిందితులు పారిపోయారు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *