6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..

6,850 చిన్న తాబేళ్లను అక్రమంగా తీసుకొచ్చారు..

Tiruchirappalli (Tamil Nadu): కస్టమ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు శుక్రవారం 6,850 లైవ్ రెడ్-ఇయర్డ్ స్లైడర్‌లు జాతి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మలేషియా కౌలాలంపూర్ నుండి తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
” పక్కా సమాచారం అందడంతో తిరుచ్చికి చెందిన AIU అధికారులు విమానాశ్రయ ఎగ్జిట్ గేట్ వద్ద ఇద్దరు ప్రయాణికులను అడ్డగించారు. వారి లగేజీని పరిశీలించగా బ్యాగ్‌లో చిన్న పెట్టెల్లో దాచిపెట్టిన చిన్న-పరిమాణంలో ఉన్న తాబేళ్లను అధికారులు కనుగొన్నారు. అలాగే
ప్రయాణీకులలో ఒకరి నుండి రూ. 57,441 విలువైన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

READ MORE  రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు...

కస్టమ్స్ అధికారుల ప్రకారం, వన్యప్రాణులను భారతదేశంలోకి తీసుకువెళ్లడానికి దిగుమతి పత్రాలు లేదా లైసెన్స్‌లు ఈ ప్రయాణికుల వద్ద లేవు. అడవి తాబేళ్లను భారతదేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకోవడానికి యత్నించారని, రెడ్-ఇయర్డ్ స్లయిడర్ తాబేళ్లను వాటి స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం అధికారులు ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేశారు, ఇద్దరిని అరెస్టు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.

 

 

READ MORE  ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *