Tuesday, March 31, 2026
Trending News

ప్రభుత్వ ఆధీనంలోని దేవాల‌యాల‌ను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..

Spread the love

VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్ర‌చారం చేప‌ట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత‌ ప్రచారాన్ని ప్రకటించింది. ఆల‌యాల‌ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం “ముస్లిం ఆక్రమణదారులు” మరియు “వలసవాద” బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు ప‌దవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ విలేఖరుల సమావేశంలో అన్నారు. “లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు “శుద్ధి కర్మలు” నిర్వహించనున్నామ‌ని ట‌ బోర్డు పేర్కొంది.

ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ చేశారని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో ‘మొత్తం హిందూ సమాజం ఆగ్రహం వ్య‌క్త‌మైంద‌ని జైన్ అన్నారు. కేరళలోని శబరిమల వంటి అనేక ఇతర దేవాలయాల నుంచి కూడా ఇటువంటి కల్తీకి సంబంధించిన నివేదికలు వస్తున్నాయని పేర్కొంటూ , జైన్ దీనిని “హిందూ సమాజం మనోభావాలతో ఆట‌లాడ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. .

VHP campaign “ఈ అన్నివివాదాల మధ్య ఉన్న ఏకైక సంబంధం ఏమిటంటే, ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దేవాలయాలు. ఆలయాలను ప్రభుత్వాల నియంత్రణ నుంచి విముక్తి చేసి సమాజానికి అప్పగించడమే సమస్యకు స్థిరమైన పరిష్కారం అని చెప్పారు. ప్రభుత్వాలు నడుపుతున్న దేవాలయాలను “రాజ్యాంగ విరుద్ధం”గా పేర్కొంటూ జైన్ ఇలా అన్నారు.. “రాష్ట్రానికి మతం లేదని ఆర్టికల్ 12 చెబుతోంది. అలాంటప్పుడు ఆలయాలను నడిపే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? ఆర్టికల్ 25 మరియు 26 మన సంస్థలను నిర్వహించే హక్కును కల్పిస్తున్నాయి. మైనారిటీలు వారి సంస్థలను నిర్వహించగలిగితే, హిందువులు ఎందుకు చేయకూడదు.

“ముస్లిం ఆక్రమణదారులు దేవాలయాలను ధ్వంసం చేసి దోచుకున్నారు. బ్రిటిష్ వారు తెలివైనవారు.. దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విధంగా వారు దేవాలయాలను దోచుకోవడానికి ఒక సంస్థాగత వ్యవస్థను స్థాపించారు. దురదృష్టవశాత్తు, స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మన రాజకీయ నాయకులు కూడా ఈ వలసవాద మనస్తత్వం నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. దేవాలయాలను ప్రభుత్వాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం ఇదే ఆలోచనకు అద్దం పడుతోంది. ఈ దోపిడీ ఇప్పుడు అంతం కావాలి. మా నినాదం ఏమిటంటే: హిందూ మనీ ఫర్ హిందువు,” అన్నారాయన.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *