
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో వచ్చే మూడు-నాలుగు సంవత్సరాలలో రూ.2 లక్షల కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టు (Telangana state highways)లను చేపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రూ.3,900 కోట్లకు పైగా విలువైన అనేక రోడ్డు ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు గత 10 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువగా 5,000 కి.మీ.కు చేరుకుందని అన్నారు.
33 జిల్లాల్లో కొనసాగుతున్న పనులు
“తెలంగాణలోని 33 జిల్లాల్లో రోడ్డు పనులు నిరంతరం జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.1.25 లక్షల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మీరు ఇప్పుడు చూసిన అభివృద్ధి కేవలం మంచుకొండ యొక్క కొన మాత్రమే. రాబోయే కాలంలో, రాబోయే 3-4 సంవత్సరాలలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టబోతున్నాం. ఈ పనులు పూర్తయిన తర్వాత తెలంగాణ ఇమేజ్ మారుతుందని నా నమ్మకం” అని గడ్కరీ అన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో కేంద్రం యొక్క “అమృత్ సరోవర్” పథకం కింద నీటి సంరక్షణ ప్రాజెక్టులను చేపట్టడానికి గడ్కరీ ముందుకొచ్చారు. ఇందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల సహకరించాలని కోరారు.
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద దేశంలోని 6.5 లక్షల గ్రామాలకు 4.5 లక్షల గ్రామాలకు రోడ్లు వేశామని ఆయన అన్నారు. ఈ సభలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దానసరి అనసూయ సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు, హైవే ప్రాజెక్టులు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య సురక్షితమైన, సున్నితమైన కనెక్టివిటీని అందిస్తాయని అదే సమయంలో వాణిజ్యం, పర్యాటకం, పెట్టుబడులకు కొత్త అవకాశాలను మెరుగుపరుస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.