
వరంగల్ గగనానికి రెక్కలు.. మామునూరు ఎయిర్పోర్ట్ పనులకు గ్రీన్ సిగ్నల్! -Mamnoor Airport Warangal
కేంద్రానికి భూముల అధికారిక అప్పగింత..2.5 ఏళ్లలో విమానాలు ఎగిరేలా లక్ష్యం -కాకతీయుల శిల్పకళా వైభవంతో టెర్మినల్ భవనం- కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇది దిశానిర్దేశం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కMamnoor Airport Warangal : ఓరుగల్లు ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. చారిత్రక మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు కీలక అడ్డంకిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూములను గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కు అధికారికంగా అప్పగించారు.కాకతీయ శిల్పకళతో టెర్మినల్ నిర్మాణం:ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, మామునూరు విమానాశ్రయాన్ని త్వరి...
