Vane Bharat Express | వందే భారత్ రైళ్ల వేగం తగ్గింది…!
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. దీంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్యస్థానాలకు వెళ్లడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఈ వందేభారత్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్ రైళ్ల వేగం క్రమంగా తగ్గిపోతున్నట్లు తెలిసింది. గత మూడేండ్లలో వందే భారత్ రైళ్ల స్పీడ్ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కుచ ట్టం కింద దరఖాస్తు చేయగా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు.IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరల...