Bengaluru Metro | బెంగళూరు మెట్రో ఎల్లో లైన్లో ఐదవ రైలు సేవలు రేపటి నుంచి ప్రారంభం
Bengaluru Metro : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) నవంబర్ 1 నుంచి ఎల్లో లైన్లో ఐదో మెట్రో రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. 70వ కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava) వేడుకల సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కొత్త రైలు సర్వీస్ చేరికతో, పసుపు లైన్లో రద్దీ సమయాల్లో రైళ్ల సర్వీసులు 19 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గుతుందని BMRCL తెలిపింది.ఈ ఎల్లో లైన్లో మరో రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు స్టేషన్ల వద్ద రైళ్ల కోసం పడిగాపులు కాసే ఇబ్బందులు తొలగిపోనున్నాయని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది.అయితే, RV రోడ్, బొమ్మసంద్ర అనే రెండు టెర్మినల్ల నుంచి మొదటి మరియు చివరి రైలు సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని BMRCL స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి, మెరుగైన మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని BMRCL కోరింది.ఎల్లో లైన్లో తగ్గనున...

