
SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవిలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..
SCR Special Trains | తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖరులో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశముంది. దీంతో చాలా మంది వివిధ సమ్మర్ వెకేషన్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఇందులో కొన్ని రైళ్లు సికింద్రాబాద్ నుంచి నడవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పాట్నా-సికింద్రాబాద్ (03253) మధ్య మే 1 నుంచి జూలై 31 వరకు ప్రతీ సోమ, బుధవారాల్లో నడుస్తుంది. హైదరాబాద్ – పాట్నా (07255) రైలు మే ...


