
గుడ్న్యూస్.. ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే..! – Special Trains Extended
SCR Special Trains Extended | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి, జాల్నా -తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వొచ్చే సంవత్సరం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఈమేరకు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించింది.చర్లపల్లి-నర్సాపూర్ (07233) రైలు (Charlapalli to Narasapur Train) ప్రతి శనివారం సాయంత్రం 7.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుందని పేర్కొంది.ఇక నర్సాపూర్-చర్లపల్లి (07234) రైలు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని పేర్కొంది. Special Trains Extendedజాల్నా-తిరుపతి (07609) రైలు (Jalna to Tirupati Special Train) ప్రతి సోమవారం ఉదయం అందుబాటులో ఉంటుందని.. జాల్నా స్టేషన్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు ...