
Vande Bharat : త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు | ఢిల్లీ–పాట్నా మార్గం ప్రారంభం.. పంజాబ్లో కొత్త రైల్వే లైన్
అక్టోబర్ 15 నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధంఢిల్లీ–పాట్నా మార్గంలో రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభంపంజాబ్లో రాజ్పుర–మోహాలి మధ్య కొత్త రైల్వే లైన్ఫిరోజ్పూర్–భటిండా–పాటియాలా–ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్పంజాబ్ రైల్వే పెట్టుబడుల్లో అపూర్వ వృద్ధిన్యూఢిల్లీ: త్వరలో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper Express) రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈ రైలు అభివృద్ధి చివరి దశలో ఉందని, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.అధికారుల ప్రకారం, ఒక రైలు ఇప్పటికే అవసరమైన పరీక్షలన్నింటిని నిర్వహించారు. దిల్లీలోని షకుర్ బస్తీ డిపోలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది."రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ సర్వీసులను నిర్వహించడానికి రెండవ రైలు అవసరం. అందుకే మేము రెండో రేక్ కోసం ఎదురు చూస్తున్నాం. అది మాకు అందిన ...
