
eShram Portal | ఈ-శ్రామ్ పోర్టల్ కు పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు.. మూడేళ్లలోనే 30కోట్ల మార్క్…
eShram Portal | అసంఘటిత రంగ కార్మికుల జాతీయ డేటాబేస్ eSharm పోర్టల్ మూడేళ్ల కాలంలోనే 30 కోట్ల రిజిస్ట్రేషన్ల మైలురాయిని అధిగమించిందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విజయం దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.దీని ప్రకారం కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ (MoLE) ఆగస్టు 26, 2021న eShram పోర్టల్ (eShram Portal)ను ప్రారంభించింది. ప్రారంభించిన మూడు సంవత్సరాలలో ఈ-శ్రామ్ 300 మిలియన్లకు పైగా అసంఘటిత కార్మికులను నమోదు చేసింది, అసంఘటిత కార్మికులు ఇందులో వేగంగా, విస్తృతంగా నమోదవుతున్నారు. దేశంలోని అసంఘటిత కార్మికుల కోసం ఇశ్రామ్ పోర్టల్ను "వన్-స్టాప్-సొల్యూషన్"గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
2024-25 బడ్జెట్ ప్రసంగంలో, "ఇశ్రామ్ పోర్టల్ను ఇతర పోర్టల్లతో సమగ్రంగా ఏకీకృతం చేసి వన్-స్...