
RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం
కేయూ ప్రొఫెసర్ డాక్టర్ మామిడాల ఇస్తారిWarangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మెరుగు సుధాకర్ (Dr. Merugu Sudhakar) మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్లోనే అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు.ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్టర్ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం హిందువుల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, సమాజంల...



