Indian Railways | వేసవిలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు..
Indian Railways | వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ రైళ్ల ట్రిప్పుల సంఖ్యను ఏకంగా 43 శాతానికి పైగా పెంచింది. భారతీయ రైల్వేలు వేసవి కాలంలో రికార్డు స్థాయిలో 9, 111 ట్రిప్పులను నిర్వహిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 వేసవితో పోలిస్తే భారీ సంఖ్యలో పెంచామని తెలిపింది.
కీలకమైన గమ్యస్థానాలను అదనపు రైళ్లు
మంత్రిత్వ శాఖ ప్రకారం, అదనపు రైళ్లను దేశవ్యాప్తంగా కీలకమైన గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. 9,111 రైలు ట్రిప్పులలో పశ్చిమ రైల్వే అత్యధిక సంఖ్యలో 1,878, నార్త్ వెస్ట్రన్ రైల్వే 1,623 ట్రిప్పులను నిర్వహిస్తుంది. ఇతర రైల్వే జోన్లు, దక్షిణ మధ్య రైల్వే (1,012 ట్రిప్పులు), తూర్పు మధ్య రైల్వే (1,003) సంఖ్యలో ట్రిప్పులను నడుపు...