Thursday, June 19Thank you for visiting

Tag: puri

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

National
Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత‌మైన‌ హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భ‌క్తులు తరలివస్తారు. జగన్నాథ దేవాలయం నుంచి.. దేవతలు జన్మించినట్లు విశ్వసించే గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని ర‌థ‌యాత్ర‌గా తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్ర 2024 తేదీ, స‌మ‌యం.. జూన్ లేదా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది జూలై 7న ఉదయం 4:26 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది, ఈ ఉత్సవం జూలై 16, 2024న జరిగే బహుద యాత్రతో ముగుస్తుంది. పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 శుభ తిథి పూరీ జగన్నాథ రథయాత్ర‌ ఆదివారం, జూలై 7, 2024న జ‌రుగుతుంది. ఆషాడ మాసంలోని శుక్ల పక్షంలో తిథిగా జరుపుకుంటారు. ద్వితీయ తిథి ఉదయం 04:26 గంటలక...
Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

National
Rath Yatra 2024 | ఒడిశాలోని పూరీలో జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథయాత్రను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 07 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వే మంత్రిత్వ శాఖ రథయాత్ర సీజన్‌లో పూరీకి వెళ్లి రావడానికి 315 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్ల (Rath Yatra Special Trains) ను షెడ్యూల్ చేసింది, ఎందుకంటే రైల్వే సాధారణ కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.జునాగఢ్‌ రోడ్, సంబల్పూర్, కేందుజుహర్‌ గఢ్, పారాదీప్, భద్రక్, బాదంపహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, అనుగుల్, దసపల్లా, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ...
Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

Trending News
Puri Jagannath Rath Yatra | ఒడిశాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ‌ రథయాత్ర పూరీ క్షేత్రం స‌న్న‌ద్ధమవుతోంది. ర‌థ‌యాత్ర కోసం భారీ ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ వెల్లడించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించారు. జూలై 7న జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో అత్యున్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రథయాత్రకు హాజరు కానున్న రాష్ట్రపతి ముర్ము అయితే ఈసారి రథయాత్ర ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటుండడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది రథయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేయడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ తెలిపారు. ఇక కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున జరిగ...
New Vande Bharat trains | అందుబాటులోకి మరో 10 వందేభారత్ రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

New Vande Bharat trains | అందుబాటులోకి మరో 10 వందేభారత్ రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

National
New Vande Bharat trains |  రైలు ప్రయాణాలను ఆస్వాదించేవారికి  ఇది నిజంగా శుభవార్త.  ఒకే రోజు 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య   51కి పైగా పెరిగింది. ఇవి  దేశంలో  45 మార్గాలను కవర్ చేసేలా  నెట్‌వర్క్‌ను విస్తరించింది.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంకల్ప శక్తికి ఈ రోజు సజీవ నిదర్శనమని, దేశ భవిష్యత్తును, రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దాలని యువతను కోరారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు 24 రాష్ట్రాలు , 256 జిల్లాల్లో బ్రాడ్ గేజ్ విద్యుద్దీకరణ నెట్‌వర్క్‌ల ద్వారా రాష్ట్రాలను కలుపుతూ 41 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను  అందిస్తున్నాయి.నివేదికల ప్రకారం, ఢిల్లీ-కత్రా, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-వారణాసి, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, మరియు కొత్త విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గంతో స...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..