ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..
ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్
ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు.
ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్ కోడ్ను అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో కొంతమంది అసభ్యకరమైన రీతిలో దుస్తులతో కనిపించడంతో 'నీతి' సబ్కమిటీ ('Niti' sub-committee ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని, దురదృష్టవశాత్తూ కొందరు ఇతరుల మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ అన్నారు.
"కొంతమంది చిరిగి...