రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం
కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల బృందం బైక్ ర్యాలీని చేపట్టింది. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్కు బైక్ యాత్ర చేపట్టారు.'నారీ సశక్తికరణ్ మహిళా మోటార్సైకిల్ ర్యాలీ' అనే పేరుతో గత మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇక్కడి నేషనల్ వార్ మెమోరియల్ (NWM) నుంచి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ఈ యాత్ర జమ్ముకు చేరుకుంది. జూలై 25న ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగియనున్న ఈ యాత్ర, 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాల జ్ఞాపకార్థం.. అలాగే మహిళల అలుపెరగని స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలి...