
కొత్తగా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Nagpur-Secunderabad Vande Bharat | నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవలందించనుంది. ప్రస్తుతం నాగ్పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది.ఈ రైలు నాగ్పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు సికింద్రాబాద్లో మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8:20 గంటలకు నాగ్పూర్ చేరుకుంటుంది. టైమ్టేబుల్లో స్వల్ప సర్దుబాట్లు ఉండవచ్చని గమనించాలి.ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
తగ్గనున్న ప్రయాణ సమయం
ఈ కొత్త...