Saturday, August 2Thank you for visiting

Tag: Myanmar

Earthquake : మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం

Earthquake : మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం

World
Earthquake : భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ ఆపన్న హస్తం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ ప్రభుత్వ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో మాట్లాడారు. మయన్మార్‌ను కుదిపేసిన భూకంపంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు భారతదేశం అండగా నిలబడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్రహ్మ (Operation Brahma) కింద, విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, సెర్చ్, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నామని ఆయన అన్నారు.'X' పోస్ట్‌లో ప్రధాని మోదీ భూకంపం (Earthquake)లో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒక సన్నిహిత మిత్రుడిగా, పొరుగు దేశంగా, భారతదేశం ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఆపరేషన్ బ్రహ్మ కింద విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సహాయం, శోధన, రక్షణ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వేగంగా పంపుతున్నాం ...
మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

National
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు.మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది."ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది" అని చీఫ్ సెక్రటరీ తెలిపారు.మయన్మార్ జాతీయులు శని, ఆది...